హైదరాబాద్లో రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తం
హైదరాబాద్: గ్లోబల్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్ దజో భారతదేశంలో తన మొదటి డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దజో గ్రూప్ సీఈఓ షే సెగేవ్ మాట్లాడుతూ రూ.200 కోట్ల ప్రారంభ పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్లో సుమారు రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడించారు.
ఈ సంవత్సరం చివరి నాటికి, ఉద్యోగుల సంఖ్యను వెయ్యికి పెంచుతామని వెల్లడించారు. 2024 డిసెంబరు నాటికి ఉద్యోగుల సంఖ్య 2500కి పెరుగుతుందన్నారు. దజో గ్రూప్ ఐదు కేంద్రాల్లో 3,000 మంది పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 మార్కెట్లలో నంబర్వన్ అయిన ఈ కంపెనీ యునైటెడ్ కింగ్డమ్తోపాటు ఇతర మార్కెట్లలో ఐపీఎల్ ప్రసార హక్కులను పొందింది.
స్ట్రీమింగ్ యాప్తో పాటు, దజో ఇంటరాక్టివ్ యాప్ను కూడా రూపొందిస్తున్నామని, వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లకు టిక్కెట్లు, మెర్చండైజ్ కొనుగోలు చేయవచ్చని, ఆన్లైన్ గేమ్లు ఆడవచ్చని సీఈఓ వివరించారు. దజో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సందీప్ టికు మాట్లాడుతూ హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్... యాప్ డెవలప్మెంట్, ఇంటరాక్టివ్ ఎక్స్పీరియెన్సెస్, డేటా అనలిటిక్స్పై పోకస్ చేస్తుందని అన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2023-05-25T03:13:40Z dg43tfdfdgfd