నీటి సమస్య రావొద్దు : కార్పొరేటర్ సామల హేమ
సీతాఫల్మండి, వెలుగు: లో ప్రెజర్, ఓవర్ ఫ్లో ఫిర్యాదులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీతాఫల్మండి కార్పొరేటర్సామల హేమ అన్నారు. శ్రీనివాస్నగర్ లోని వాటర్ వర్క్స్ ఆఫీస్లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డివిజన్లో నీటి సమస్య ఉండొద్దన్నారు. పెండింగ్లో ఉన్న పనులను తొందరగా పూర్తి చేయాలని ఆఫీసర్లను కోరారు.
కార్యక్రమంలో వాటర్ బోర్డు డీజీఎం కృష్ణ, మేనేజర్నవ్య పాల్గొన్నారు. నామాలగుండులో నిర్మిస్తున్న డివిజన్ ఆఫీసు పనులను ఆఫీసర్లతో కలిసి సామల హేమ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆఫీసర్లు, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
©️ VIL Media Pvt Ltd. 2023-05-25T05:58:42Z dg43tfdfdgfd